అందాల భామ రాశిఖన్నా ప్రస్తుతం తెలుగు సినిమాలని పక్కన పెట్టి కోలీవుడ మీద ఫోకస్ పెట్టింది.30 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ అమ్మడు సౌత్ లో ప్రతి ఏడాది కనీసం రెండు నుంచి మూడు సినిమాలు కచ్చితంగా చేస్తూ వస్తుంది.అయితే ఇన్ని రోజులు తెలుగు సినిమాల మీదనే ఫోకస్ పెట్టిన ఈ భామ ఇప్పుడు తమిళ సినిమాల మీద ద్రుష్టి పెట్టింది.అక్కడ కూడా స్టార్ హీరోయిన్ ఫేమ్ తెచ్చుకోవాలని అనుకుంటుంది.
దాని కోసం గట్టిగానే ప్లాన్ చేసింది.ఇప్పటికే అరన్మణి సీక్వెల్ తో పాటు సూర్యకి జోడీగా ఒక సినిమా చేస్తుంది.
అలాగే లేడీ ఒరియాంటెడ్ సినిమాలకి కూడా సైన్ చేసింది.మొత్తం ఇప్పటికే ఓ నాలుగు సినిమాల వరకు రాశి ఖాతాలో ఉన్నాయి.
ఇప్పుడు మరో సినిమా వచ్చి చేరింది.
చియాన్ విక్రమ్ ప్రస్తుతం కోబ్రా సినిమాతో పాటు మణిరత్నం దర్శకత్వంలో పోన్నియన్ సెల్వన్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.
దీంతో పాటు మహావీర్ కర్ణ అనే మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కూడా ఉంది.వీటితో పాటు హరి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
సింగం సిరీస్ తర్వాత హరి విక్రమ్ కలయికలో సామీ స్క్వేర్ వచ్చింది.అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
అయితే ఈ సారి ఎలా అయిన సక్సెస్ కొట్టాలని అనుకున్న హరి సూర్యతో ఒక మూవీ అనుకున్నారు.అయితే ఏవో కారణాల వలన ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.
ఈ నేపధ్యంలో విక్రమ్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నాని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.