రాశి ఖన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపు తున్నారు.ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయం లోనే ఎన్నో చిత్రాలలో నటించి తన కంటూ మంచి గుర్తింపును సంపాదించు కున్నారు.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగసౌర్య సరసన ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన రాశి ఖన్నా ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపు తున్నారు.
తెలుగులో తను నటించిన మొదటి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఎన్నో అవకాశాలను దక్కించుకుంది.
జోరు, విలన్, ప్రతి రోజు పండుగే, వెంకీ మామ వంటి చిత్రాలు విజయవంతం కావడంతో మరిన్ని అవకాశాలను దక్కించుకుంది.
తాజాగా ఈ అమ్మడు మైనస్ డిగ్రీల చలిలో విహరిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది.
అత్యంత చలిగా మారిన మాస్కో నగరంలో ఈమె విహరిస్తోంది.రష్యా వీధుల్లో తిరుగుతున్న ఫోటోను తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసింది.
ఈ ఫోటో ఆమె అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.అయితే ఈమె అంత చలిలో ఈమె అక్కడికి వెకేషన్ కి వెళ్లిందా.
లేదంటే ఎందుకు వెళ్ళింది అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
ఈమె ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన థాంక్యూ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా ప్రసెంట్ షూటింగ్ మాస్కోలో జరుగుతుంది.
ఈ షూటింగ్లో పాల్గొనడానికి రాశి ఖన్నా అక్కడికి వెళ్లినట్టు తెలుస్తుంది.
ఇక్కడ చారిత్రక కట్టడాల మధ్య ఉన్న అందమైన వీధుల్లో చిత్రీకరణ జరుపు తున్నారు.ప్రకాష్ రాజ్ తో పాటు కీలక నటీనటుల పై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.