శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న రెండో మహా సముద్రం.ఆర్ ఎక్స్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి పూర్తిగా ఇదే కథ మీద దృష్టిపెట్టడంతో పాటు చాలా మంది హీరోల దగ్గరకి తిరిగాడు.
అయితే ఎవరూ ఈ మల్టీ స్టారర్ కథపై పెద్దగా ఆసక్తి చూపించలేదు.ఫైనల్ దీనికి శర్వానంద్, సిద్ధార్ద్ ఒకే చెప్పడంతో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యింది.
ఇంతలో కరోనా లాక్ డౌన్ కారణంగా మళ్ళీ వాయిదా పడింది.ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది.
త్వరలో సినిమాలు పట్టాలు ఎక్కించాలని చూస్తున్న అజయ్ భూపతి దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఒకరే ఉంటారని తెలుస్తుంది.
ఇక ఈ పాత్ర కోసం రాశీఖన్నాని ఫైనల్ చేసినట్లు సమాచారం.ప్రస్తుతం ఆమె తమిళంలో సూర్యతో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పింది.
తెలుగులో మరే ఇతర సినిమాలు చేతిలో లేవు.దీంతో మహా సముద్రంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే స్నేహితులైన ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య స్నేహం, వైరం నేపథ్యంలో కథనం సాగుతుందని హీరోయిన్ ని ప్రేమించిన శర్వా ఓ దాడిలో చనిపోతాడని, ఆ తర్వాత రాశీ, సిద్ధార్థ్ల మధ్య జరిగే ప్రేమ సంఘర్షణే ఈ సినిమా అని కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది తెలియాలంటే అజయ్ భూపతి క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి.