ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటివరకు ఎన్నో కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ గ్లామరస్ పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ మొట్టమొదటిసారి హర్రర్ చిత్రంలో నటిస్తూ ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే లేడి ఓరియెంటెడ్ చిత్రం ద్వారా ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తమిళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ‘అరాణ్మణై-3’ సినిమాన్ని తెలుగులో అంతపురంగా తెరకెక్కించారు.
ఇందులో రాశీ ఖన్నా పాత్ర ఎంతో భయంకరంగా ఉండబోతోందని నవ్విస్తూనే ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని నిర్మాతలు వెల్లడించారు.ఒక అంతపురంలో జరిగిన ఒక అనూహ్య ఘటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆత్మ ఎవరిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోబోతుందనే అంశం పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇదివరకు ఎన్నో సినిమాలలో గ్లామరస్ పాత్రలో అందరిని సందడి చేసిన రాశీఖన్నా మొట్టమొదటిగా హర్రర్ సినిమాల్లో తన నటన, గ్లామర్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయని తెలిపారు.సాక్షి అగర్వాల్, వివేక్ వంటి వారు ప్రధాన పాత్రలలో కనిపించారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య సరసన థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు.అలాగే పలు తమిళ చిత్రాలతో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.