ఈ మధ్య కాలంలో టాలీవుడ్ అందాల భామలు హీరోయిన్స్ గా తెరపై గ్లామర్ అందాలతో అందరిని మెస్మరైజ్ చేస్తూనే తమలోని టాలెంట్ ని కూడా బయటకి తీస్తున్నారు.సింగర్స్ గా కూడా తమ సత్తా చూపిస్తున్నారు.
ఇప్పటికే నిత్యా మీనన్, అనుపమ పరమేశ్వరన్ లాంటి మలయాళీ ముద్దుగుమ్మలు తాము మంచి గాయకులమని ప్రూవ్ చేసుకున్నారు.ఇదే కోవలో రాశిఖన్నా కూడా మంచి సింగర్ గా తనని తాను ప్రూవ్ చేసుకొని తాను నటించిన సినిమాలలో పాటలు పాడింది.
ఇక లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఇంట్లో ఉంటున్న ఈ అమ్మడు తనలో మరో హిడెన్ టాలెంట్ ని కూడా బయట పెట్టింది.
గిటార్ వాయిస్తూ ‘గెట్ యూ ది మూన్’ అనే పాట పాడి అలరించింది.
అయితే ఈ పాట వినటానికి అద్భుతంగా ఉంది.అయితే ఈమె జవాన్ సినిమానుండి బంగారు అనే సాంగ్, జోరు సినిమాలో టైటిల్ సాంగ్ మరియు పువ్వులకు రంగెయ్యాల అనే పాటలు, జిల్ సినిమాలో పోరి మసాలా పోరి అనే పాట , హైపర్ మూవీ టైటిల్ సాంగ్ అదేవిధంగా ప్రతిరోజు పండగే సినిమానుండి యు ఆర్ మై హై వంటి పాటలను పాడి అభిమానులను అలరించిన తనలో మంచి గిటార్ ప్లేయర్ కూడా ఉందని రాశి ఖన్నా చూపించుకుంది.
మొత్తానికి ఒకప్పుడు హీరోయిన్స్ కేవలం నటనకి పరిమితం అయితే నేటితరం హీరోయిన్స్ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటూ అందరితో ప్రశంసలు పొందుతున్నారు.