టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న భామ రాశి ఖన్నా.ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
అయితే ఆమె తెలుగులో స్టార్ హీరోల సినిమాలు పెద్దగా నటించే ఛాన్స్ రాలేదు.ఒక్క తారక్ తో జై లవకుశ సినిమాలో నటించింది.
ఆ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ కూడా తగ్గుతూ వచ్చింది.తెలుగులో ప్రస్తుతం ఈ భామకి చిన్న సినిమాలు తప్ప పెద్దగా అవకాశాలు లేవు.
స్టార్ కమర్షియల్ సినిమాలలో రాశి ఖన్నాకి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు.ఇలాంటి టైంలో ఊహించని విధంగా కోలీవుడ్ లో నుంచి ఆమెకి అదిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చింది.
సింగం సిరీస్ తరువాత స్టార్ హీరో సూర్య – హరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే.ఈసినిమా కు అరువా అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈ చిత్రం జూలై లో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈచిత్రం లో సూర్య సరసన హీరోయిన్ గా రాశి ఖన్నా ఛాన్స్ కొట్టేసింది.
ఈ విషయాన్ని స్వయంగా రాశినే వెల్లడించింది.ఆమె ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో ముచ్చటిస్తూ తన నెక్స్ట్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చింది.
ఈ సందర్భంగా ఓ అభిమాని మీ తదుపరి చిత్రాలు ఏంటని అడగగా ప్రస్తుతం సూర్య తో అరువా లో చేయనున్నాని అలాగే మరో రెండు తెలుగు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయని లాక్ డౌన్ అయిపోయాక వాటి గురించి చెపుతానని బదులిచ్చింది.మొత్తానికి తమిళంలో మొదటి సినిమానే ఏకంగా సూర్యతో నటించే ఛాన్స్ రావడం ఈ అమ్మడు అదృష్టం అని చెప్పాలి.