బాహుబలి సినిమా తో రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.ఆయన చేస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన వంద కోట్ల భారతీయుల దృష్టిని ఆకర్షిస్తుంది.
అందుకే ఆయన సినిమాను మేకర్స్ ప్రతి ఒక్కరు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించడంతో పాటు విడుదల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నారు.ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.
ఆ సినిమాను తెలుగులోనే రూపొందిస్తున్నట్లు గా మొదట వార్తలు వచ్చాయి కానీ సినిమా పూర్తి అయ్యేసరికి హిందీలో కూడా సినిమాను చేసినట్లుగా చెబుతున్నారు.హిందీ వర్షన్ కోసం ప్రత్యేకంగా నటీనటులను నటింప చేయడంతో పాటు హిందీ వెర్షన్ కోసం ప్రత్యేకంగా పాటలను కూడా చేయించారు.
ఇటీవల విడుదలైన పాట కేవలం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మాత్రమే విడుదలైంది.డిసెంబర్ మొదటి వారంలో హిందీలో మొదటి పాట విడుదల కాబోతుంది.
సినిమాకు రెండు వర్షన్ ల్లో పాటలు విడుదల కాబోతున్నాయి.అంటే రెండు భాషల్లో విభిన్నమైన పాటలు రావడం ఇదే మొదటిసారి పాన్ ఇండియా సినిమాలు కచ్చితంగా రాధేశ్యాం రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరూ అంటున్నారు.కానీ పాటల విషయంలో మాత్రం ఖచ్చితంగా అరుదైన రికార్డుని దక్కించుకుందని ఎందుకంటే ఇక్కడ వేరే పాటలు అక్కడ వేరే పాటలు ఉండబోతున్నాయి.ఒకవేళ సన్నివేశాలు కూడా వేర్వేరుగా ఉంటే ప్రభాస్ అభిమానులు ఆ వర్షన్ ఈ వర్షన్ అనే తేడా లేకుండా రెండు వెర్షన్లు కూడా సినిమా చూసే అవకాశం ఉంది.
అదే జరిగితే బాహుబలి ని మించి వసూలు రావడం ఖాయం అంటూ మరియు బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలి.