టెక్నాలజీ( Technology ) రోజురోజుకీ పెరిగిపోయి ప్రపంచం ముందుకుపోతోంది అని సంతోషపడాలో, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని బాధపడాలో తెలియడంలేదు.అలాంటి సమస్యే ఒకటి మొట్టమొదటి సారిగా ఇపుడు బయటపడింది.
కోల్కతాలోని ( Kolkata ) ఒక వ్యక్తి 3 నెలల నుంచి గొంతు సమస్యతో బాధ పడుతున్నాడు.కారణం తెలుసుకునేందుకు వైద్యులను సంప్రదించగా వారు ఎండోస్కోపీ చేశారు.
ఆ పరీక్షలో తేలింది ఏమంటే, అతనికి గొంతులో చిన్న మొక్కల్లాంటి ఆకారాలు కనిపించాయని తేలింది.దాంతో అవి ఫంగస్ అని వైద్యులు తేల్చారు.
కాగా ఆ రోగికి 61 ఏళ్ల వయసు ఉన్నట్టు తెలుస్తోంది.అతను దగ్గు, అలసట, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలతో… 3 నెలలుగా ఇబ్బంది పడడంతో వైద్యుల్ని సంప్రదించారు.దాంతో ఈ అరుదైన ఫంగల్ వ్యాధి బయటపడింది.కాగా దానిని వైద్య పరిభాషలో ‘అనోరెక్సియా’ అనే వ్యాధి అని చెబుతున్నారు.అయితే ఆయనకు మూత్రపిండ వ్యాధి, మధుమేహం, HIV వంటి సమస్యలు లేకపోవడం అదృష్టం అని చెబుతున్నారు.అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల చరిత్ర కూడా అతనికి లేదు.
అయితే ఈ వ్యాధి ఆయనకు మొక్కల ( Plants ) నుంచి సోకినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.
ఇకపోతే ఆ పేషేంట్ ఒక మైకాలజిస్ట్.తన పరిశోధన కోసం క్షీణిస్తున్న పుట్టగొడుగులు, ఇతర మొక్కల శిలీంధ్రాలను అతగాడు పరీక్షించేవాడట.అలా శిలీంధ్రాలు చేతుల ద్వారా శరీరంలో చేరినట్టు భావిస్తున్నారు.
ఆ శిలీంధ్రాల పేరు కొండ్రోస్టెరియం పర్పురియం. ఈ శిలీంధ్రాలే గొంతులో చేరి మొక్కల్లా మొలిచేశాయ్ అని వైద్యులు తేల్చి చెబుతున్నారు.
కొండ్రోస్టెరియం పర్పురియం అనేది మొక్కల శిలీంధ్రం.ఇది మొక్కలలో, ముఖ్యంగా గులాబీ కుటుంబానికి చెందిన వాటిలో వెండి ఆకుల వ్యాధిని కలిగిస్తుంది.
ఈ వ్యాధి కేవలం మొక్కలకు మాత్రమే వస్తుందని అనుకునేవారు.కానీ ఇప్పుడు తొలిసారి మానవులలో దీనిని గుర్తించారు.