గత ఏడాది ఇది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురంలో” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను పగలకొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.
సినిమా అంతటి ఘన విజయానికి సాధించటానికి గల ప్రధమ కారణం మ్యూజిక్ అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో పాటలు.
సినిమా రిలీజ్ అవ్వక ముందే సోషల్ మీడియాలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.“సామజ వర గమన” అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవగానే లాక్ డౌన్ టైం లో “బుట్ట బొమ్మ” సాంగ్ బాగా వైరల్ అయ్యింది.
“బుట్ట బొమ్మ” సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులను చాలామంది ఇమిటెట్ చేస్తూ లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు.బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మరియు క్రికెటర్లు “బుట్ట బొమ్మ” సాంగ్ కి స్టెప్పులు వేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సాంగ్ కి మిర్చి మ్యూజిక్ అవార్డు లభించింది.దీంతో మ్యూజిక్ అందించిన తమన్ త్వరలో అవార్డు తీసుకోనున్నట్లు సమాచారం.