ఈ మధ్యకాలంలో రోజుకు ఏదో ఒక చోట ఓ వింత బయటకు వస్తూనే ఉంది.సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్క విషయాన్ని ప్రపంచం మొత్తానికి చేర వేయగలుగుతున్నం.
ఇకపోతే తాజాగా చిత్తూరు జిల్లాలోని కొత్తకోట మండలం డేగాని పల్లెలో ఓ అరుదైన పక్షి స్థానికుల కంటపడింది.ప్రతి రోజూ ఉదయం లేస్తూనే పొలాలకు వెళ్లే రైతులకు ఆ పక్షి కంట పడింది.
మొదటగా పంటపొలాల్లో కి వెళ్ళిన వ్యవసాయ కూలీలు పనులలో నిమగ్నమై ఉండగా, ఇంతలో వారి దరిదాపుల్లో ఏదో జంతువు కదలాడుతున్నట్లు గమనించారు.మొదటగా రైతులు ఆ జంతువును కుందేలుగా భావించారు.
అయితే ఆ ప్రాంతంలోకి కుందేలు ఎలా వచ్చిందని చూద్దామని దగ్గరికి వెళ్లి, చూడగా అక్కడ వారికి పెద్ద పక్షి కనబడింది.అది ఎగిరి వెళ్లేందుకు ప్రయత్నిస్తోండగా వారు గమనించారు.
అయితే అది కుందేలు కాదు, పక్షి అని గమనించిన వారు ఇంత పెద్ద పక్షి ఏంటని ఆ పక్షిని పట్టుకున్నారు.దీంతో ఆ రైతులు ఇది గ్రద్దా లేకపోతే పురాణాల్లో చెప్పినట్టుగా గరుడ పక్షా అని అనుకున్నారు.
అంతలోనే అక్కడో ఓ వ్యక్తి ఇది గ్రద్ద లోనే అరుదైన జాతి అని, ఈ పక్షి అక్విలిన్ జాతి పక్షి అని తెలిపాడు.
అయితే ప్రజలు ఏ జాతి పక్షి అయితే ఏంటి చూడడానికి చాలా పెద్దగా బాగుంది కదా అని దానితో చాలామంది సెల్ఫీలు దిగి వారి కోరికను తీర్చుకున్నారు.ఇక వారు ఆ పక్షిని వారితో చాలాసేపు ఉంచుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా ఓ ప్రాంతంలో వదిలేశారు.అలా వదిలేసిన తర్వాత ఆ పక్షి ఎగిరి వెళుతుంటే… చాలా ఆనందంగా ఉందని ఆ పక్షిని పట్టుకున్న ప్రజలు తెలిపారు.