ప్రస్తుతం తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.అయితే ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం అన్ని పార్టీలకు ఇప్పుడు ప్రతిష్టాత్మక విషయం కావడంతో అందరూ విజయం సాధించడం ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది.
అయితే ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ హుజురాబాద్ నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం చాలా వరకు ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పెద్ద ఎత్తున తమ కున్న బలాబలాలను అంచనా వేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
ఇప్పటికే ఎవరికి వారు తమ గెలుపుపై సర్వేలు నిర్వహించుకుంటూనే ప్రత్యర్థి పార్టీ చేసిన ఏ చిన్న తప్పును కూడా వదలకుండా ప్రతి ఒక్కదాన్ని ప్రజల్లోకి ఇటు సోషల్ మీడియాలోనూ , ఇటు ప్రచార సభల్లోనూ ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే దుబ్బాక ఉప ఎన్నికను మించిన పరిణామాలు జరగబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం చాలా వరకు క్షేత్ర స్థాయిలో తమ తమ పార్టీలకు ఉన్న ఖచ్చితమైన ఓటు బ్యాంకును పరిరక్షించుకుంటూనే గెలుపు కోసం కావలసిన ఓటర్ల సమీకరణకు పార్టీలు రకరకాల వ్యూహాలు పన్నుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రజల్లో పార్టీలు సాధ్యమైనంత వరకు ఉండేలా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే ప్రస్తుతం ప్రజల్లో ఎంతగా ఉంటే కార్యకర్తలకు కూడా తాము గెలుపు గుర్రాలము అనే నమ్మకం ఏర్పడి విజయం కోసం మరింతగా పోరాడే అవకాశం ఉంటుంది.
లేకపోతే వెనకబడి పోయి గెలుపుకు చాలా వరకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది.ఏది ఏమైనా ఇప్పటికే ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో అనే ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తరుణంలో ప్రతి ఒక్క పరిణామం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.