ఈ ఇంటర్ నెట్ యుగంలో స్నేహాలన్నీ ఆన్లైన్ అయిపోయాయి.ముక్కు మొఖం తెలియని వారు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు.
ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకుని దగ్గరయిపోతున్నారు.సోషల్ మీడియా మరింత విజృంభించాక ఈ ట్రెండ్ మరింత పెరిగింది.
అయితే ఈ టెక్నాలజీ స్నేహాల వలన ఎంతయితే మేలు ఉందో తెలియదు కానీ కీడు అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది.
బెంగుళూరులో ఈ విధంగానే ఓ సంఘటన జరిగింది.ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయిని పరిచయం చేసుకున్న యువకుడు తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీకి తను ఫ్లాట్ కి రావలసిందిగా కోరాడు.అయితే అలా వచ్చిన యువతని అతని స్నేహితుడు అత్యాచారం చేశాడు.
పూర్తి వివరాలు పరిశీలిస్తే ….ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆరిఫ్ బెంగళూరులో ఎంబీఏ చేస్తున్నాడు.
ఆ విధంగానే అక్కడే ఎంబీఏ చేస్తున్న ఒక అమ్మాయిని 2 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.అప్పుడప్పుడు ఆమెను కలవడం కూడా చేసేవాడు.
తన పుట్టినరోజు సందర్భంగా అమ్మాయిని ఇంటికి పిలిచారు.అక్కడ ఆరిఫ్ స్నేహితుడు కర్నూలు జిల్లాకు చెందిన ఆదిత్య కూడా వచ్చాడు.ఈ ముగ్గురు కలిసి మద్యం సేవించారు.ఇంతలో తమ స్నేహితులకు భోజనం భోజనం తీసుకురావడానికి ఆదిత్య బయటికి వెళ్లాడు.ఇంతలో ఆమె కూడా నిద్రపోవడానికి రూమ్ లోకి వెళ్లగా… ఇదే సరైన సమయం అని భావించిన ఆదిత్య ఆమె మీద అత్యాచారం చేసాడు.జరిగిన విషయం ఆరిఫ్ రాగానే చెప్పిన ఆమె వెంటనే ఆదిత్యమీద పోలీస్ కేసు పెట్టింది.
పోలీసులు ఆదిత్యను అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు.
.