దేశవ్యాప్తంగా అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది.తిరుపతిలో ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది.
అభం శుభం తెలియని ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారాని పాల్పడ్డారు.
రూరల్ మండలం ముల్లపూడి వద్ద ఇద్దరు యువకులు 16 ఏళ్ల బాలికకు లిప్ట్ ఇస్తామని నమ్మించి ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
బాలికను బెదరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
గత నెల 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ మేరకు తిరుచానూరు పోలీసులు దర్యాప్తు చేశారు.నిందితులు రాజమోహన్, వెంకటేశ్ను అరెస్టు చేశారు.
బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నిందితుల్లో ఒకరు రౌడీషీటర్ కాగా, గతంలో ఒక మర్డర్ కేసులో అతని పేరు ఉంది.