తెలంగాణా లో చోటుచేసుకున్న దిశ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.రాత్రిపూట సాయం కోరిన ఒక అమాయకురాలిని నిర్ధాక్షిణ్యంగా అత్యాచారం చేసి ఆ తరువాత పెట్రోల్ పోసి తగులబెట్టి ఆమె ఉసురు తీశారు.
అయితే ఈ ఘటనలో నిందితులు కేవలం 10 రోజుల్లోనే నిందితులను ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది.అయితే ఈ ఘటన తో మరోసారి ఇలాంటి ఘోరాలు చోటుచేసుకోవని భావించినప్పటికీ కామాంధుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.
ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ,మాత్రం మహిళలపై అఘాయిత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా తెలంగాణా లోనే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురంలో ఒక ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు.తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో బాలికను అత్యాచారం చేశాడు.
అనంతరం ఆమెను చంపేయాలని ప్లాన్ చేసుకున్న అతడు ఆ బాలికపై అత్యాచారం చేసి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు.
ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆ బాలిక వరంగల్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు సమాచారం.అయితే పోక్సోచట్టం కింద కేసు పెట్టిన పోలీసులు పరారీ లో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.