స్నేహితుడు కదా అని నమ్మి కలిసి జల్సా చేసుకున్నారు.కానీ అదే అతడి కొంప ముంచింది.
మద్యం మత్తులో ఆ స్నేహితుడు చేసిన అమానుషం గురించి తెలిసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఓ వివాహితను అతికిరాతకంగా చంపిన ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరుకు చెందిన ఓ వ్యక్తి, చెక్కిల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఓ బెల్టుషాపులో మద్యం సేవించారు.
పట్టపగలే వారు మందులో మునిగితేలారు.ఈ క్రమంలో తన భార్య మొక్కజొన్న చేనులో ఉందని, ఆమె కోసిన గడ్డివామును తన బైకుపై తీసుకురావాల్సిందిగా ఆ భర్త కోరాడు.
దీంతో శ్రీనివాస్ మొక్కజొన్న చేను వద్దకు వెళ్లాడు.కాగా ఆమె పంటచేనులో చనిపోయి ఉందని శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు.
గ్రామస్థులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా, ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా మృతి చెంది ఉంది.తన భార్యను కిరాతకంగా హతమార్చిన శ్రీనివాస్ను కఠినంగా శిక్షించాలని భర్త కోరాడు.
కాగా శ్రీనివాస్ను బెజ్జంకి మండలం బెగంపేట శివారులో పట్టుకున్న పోలీసులు, అతడిని అరెస్ట్ చేశారు.మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.