బాలీవుడ్ లో చూడ ముచ్చటైన జంటల్లో దీపికా పదుకొనే,రణవీర్ సింగ్ ల జంట కూడా ఒకటి.ఈ జంటను కేవలం బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా.
ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు అనంతరం ఇటలీలోని లేక్ కొమోలో సింపుల్ గా వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.తాజాగా ఈ బాలీవుడ్ జంట ఉత్తరాఖండ్ లో తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈసారి రణవీర్,దీపిక వారి వార్షికోత్సవ వేడుకలు రహస్యంగా ఉంచారు.కానీ వారు డెహ్రడూన్ విమానాశ్రయంలో అభిమానులతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇందులో స్టైలిష్ కంఫర్ట్ వేర్ ధరించిన దీపిక, రణ్ వీర్ అభిమానులతో ఆనందంగా ఫోజులిచ్చారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటలీలోని సుందరమైన లేక్ కొమోలో వీరిద్దరూ అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.2018 నవంబర్ 14,15 తేదీలలో కొంకని, సింది సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది.అనంతరం కుటుంబం స్నేహితుల కోసం బెంగళూరు, ముంబైలో రెండు గ్రాండ్ రిసెప్షన్ లను నిర్వహించారు.ఇది ఇలా ఉంటే కబీర్ ఖాన్ చిత్రం 83 లో రన్వీర్ సింగ్ కనిపించనున్నారు ఇందులో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ నటించగా, దీపికా పదుకొనే రోమీదేవిగా కనిపించనుంది.