సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంటూనే ఉంటుంది.మొన్నటి దాక బుల్లెట్ బండి పాట శ్రోతల్ని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎక్కడ చుసిన అదే పాట.అలాగే ఇప్పుడు ‘మణికే మాగే హితే’ అనే పాట కూడా విపరీతంగా సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.ఈ పాట మీనింగ్ తెలియకపోయిన గాని అందరు ఈ పాటను బాగా ఇష్టపడుతున్నారు.పాటలోని అర్ధం విషయం పక్కన పెడితే పాడిన సింగర్ వాయిస్ మాత్రం సూపర్ అనే చెప్పాలి.
ఇంతకీ ఈ పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా శ్రీలంకలోని కొలొంబోకు చెందిన ఓ పాప్ సింగర్.ఆమె పేరు యొహాని డి సిల్వా.
ఈమె కేవలం ఒక పాప్ సింగర్ మాత్రమే కాదు గేయ రచయిత, నిర్మాత, బిజినెస్ ఉమెన్ కూడా.‘మాణికే మాగే హితే’ పాటను యొహాని 2021 మే నెలలో కంపోజ్ చేసి యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయగా అది కాస్త అన్ని సోషల్ మీడియాలలో వైరల్ అయిపోయింది.మన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ను సైతం ఈ పాటకు ఇంప్రెస్ అయిపోయారు.అయితే ఇప్పుడు ఇదే పాటను మనం రాను మోండల్ కూడా ఆలపించారు.ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి.రాను మోండల్ కూడా ఒకప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేసిన ఆవిడే.
బెంగాల్లోని రణఘాట్ వీధుల్లో ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది.
ఒక్క పాటతో రాను దశ తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని పాటలు కూడా పాడింది.ఈ నేపథ్యంలో రాను మోండల్ ‘మణికే మాగే హితే’ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించారు.రాను పాడిన ఈ పాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ పాట కూడా విపరీతంగా ట్రోల్ అవుతోంది.
రాను మోండల్ వాయిస్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.చాలా చక్కగా ఆలపించారని పొగుడుతున్నారు.అయితే ఈ పాట తెలుగు, హిందీ, కన్నడ, బెంగాళితో పాటు పలు భాషల్లో కూడా డబ్ అయ్యింది కానీ ఒరిజినల్ గా మలయాళంలోనే ఈ పాట ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకోవడం విశేషం అని చెప్పాలి.