బాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నటీనటుల్లో సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ ఒకరు.వీరి జంట ఎంతో అందంగా ఉండడమే కాకుండా కొంతమంది పెళ్లైన జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అయితే వయసులో కరీనా కపూర్ కంటే సైఫ్ అలీ ఖాన్ చాలా పెద్దవాడైనప్పటికీ వారి మధ్య ఉన్నటువంటి అర్థం చేసుకునే గుణం ఈ వయసు వ్యత్యాసాన్ని జయించింది.అయితే తాజాగా వీరి బంధం పైనటి రాణి ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా కరీనా కపూర్ తో డేటింగ్ చేయడం అంటే ఒక మగాడు మరో మగాడితో డేటింగ్ చేయడమే అంటూ కామెంట్ చేసింది.అలాగే ఈ ఆసక్తికర వ్యాఖ్యలు గురించి వివరణ ఇస్తూ కరీనా కపూర్ డేటింగ్ విషయంలో కొంతమేర హద్దులను విధించుకొని ఆ హద్దులు దాటకుండా జాగ్రత్త పడుతుంది.
అంతేగాక ఆమె తో డేటింగ్ చేయాలంటే ఎవరైనా ముందుగా ఆమెకుపెట్టిన షరతులు ఒప్పుకుంటేనే తప్ప ఆమె తో డేటింగ్ చేయడానికి అనుమతించదని అన్నారు.అంతేగాక సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ ల జంట చూడముచ్చటగా ఉంటుందనిఅంతేగాక ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
అయితే ప్రస్తుతం రాణి ముఖర్జీ నటించినటువంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఈ అమ్మడుకు చేతిలో పెద్దగా అవకాశాలు లేవు.అయితే ఈ అమ్మడు చివరిగా 2019 సంవత్సరంలో మరదాని 2 చిత్రంలో నటించింది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గోపి పుత్రన్ దర్శకత్వం వహించాడు.