రంగ్ దే శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జీ నెట్వర్క్

యంగ్ హీరో నితిన్ వరుస ఫ్లాప్ ల తర్వాత మరల భీష్మ సినిమాతో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని ఎబ్భై కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.సరైన హిట్ పడితే తన స్టామినా ఏంటో చూపించే నితిన్ ఇప్పుడు వెంకి అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు.

 Rangde Satellite Rights Taken By Zee Telugu, Tollywood, Hero Nithin, Keerthi Sur-TeluguStop.com

ఈ సినిమా ఇప్పతినే ప్రారంబోత్సవం కూడా జరుపుకుంది.ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉన్న కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

ఇందులో నితిన్ కి జోడీగా అభినవ మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.ఇక మహానటి అజ్నాతవాసి తర్వాత మరల డైరెక్ట్ కమర్షియల్ హీరోయిన్ గా కీర్తి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోయినా దీనికి సంబందించిన శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి.సితారా ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మితమవుతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులని జీ నెట్వర్క్ సంస్థ ఏకంగా పదికోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

భీష్మ హిట్ తో మళ్ళీ పుంజుకున్న నితిన్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని జీ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ సంవత్సరం నితిన్ వరుస ఏకంగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు.

ఇవి హిట్ అయితే అతని రేంజ్ మారిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube