పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ రంగస్వామి కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు.దక్షిణ భారతదేశంలో అసెంబ్లీ తో కూడిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ- అన్నాడిఎంకె కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.జరిగిన ఎన్నికలలో ఎన్ఆర్సీకి 10 సీట్లు, బీజేపీకి 6 సీట్లు దక్కాయి.
ఇండిపెండెంట్లు 6 స్థానాల్లో, ప్రతిపక్ష డీఎంకేకు 6, కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కాయి.దీంతో ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ ఎన్.రంగస్వామి .చేత ఇంచార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ మధ్యాహ్నం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ పరిణామంతో పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి నాలుగోసారి పదవీ బాధ్యతలు చేపట్టినట్లు అయింది.కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉన్నత అధికారులు సీనియర్ నేతలు మాత్రమే హాజరయ్యారు.
అయితే సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయగా.త్వరలో మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు నుండి అందుతున్న సమాచారం.