మహేష్‌, చరణ్‌లలో విజేత ఎవరో తేలిపోయింది

ఈ సమ్మర్‌కు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ దక్కాయి.

 Rangasthalam Vs Bharat Ane Nenu Who Is Win-TeluguStop.com

శ్రీమంతుడు చిత్రం తర్వాత కొరటాల, మహేష్‌బాబుల కాంబో మూవీ అవ్వడంతో ప్రేక్షకులు విపరీతంగా సినిమాను ఆధరించారు.సినిమా చాలా బాగుందనే టాక్‌ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో థియేటర్లు హౌస్‌ ఫుల్‌ అయ్యాయి.

మహేష్‌బాబు సీఎంగా కనిపించిన విషయం తెల్సిందే.రికార్డు స్థాయి వసూళ్లతో టాలీవుడ్‌ నెం.3 చిత్రంగా మహేష్‌ బాబు మూవీ నిలుస్తుందని ఆశించారు, కాని అది జరగలేదు.

మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రం కంటే ముందు వచ్చిన రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రం దుమ్ము దుమ్ముగా వసూళ్లు సాధించింది.85 కోట్లు వసూళ్లు చేస్తే అప్పటికే గొప్ప అంటూ అంతా భావించారు.కాని అనూహ్యంగా రంగస్థం చిత్రం సునాయాసంగా 200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేయడంతో పాటు లాంగ్‌ రన్‌లో ఏకంగా 126 కోట్ల రూపాయల షేర్‌ను దక్కించుకుని టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంగా నిలిచింది.

రామ్‌ చరణ్‌ చెవిటి వాడిగా నటించడంతో పాటు సమంత అద్బుతమైన నటనతో సినిమాకు హైలైట్‌గా నిలిచారు.సుకుమార్‌ ఈ చిత్రాన్ని పూర్తి పల్లెటూరు వాతావరణంలో అది కూడా 1980 కాలం నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది.

చరణ్‌ సమ్మర్‌ సీజన్‌ను ప్రారంభించిన రెండు వారాల్లోనే మహేష్‌బాబు తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మహేష్‌బాబు మూవీ వచ్చిన తర్వాత కూడా రంగస్థలం చిత్రానికి కలెక్షన్స్‌ నిలకడగా వచ్చాయి.

దాంతో కలెక్షన్స్‌ భారీగా నమోదు అయినట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.ఓవర్సీస్‌లో మహేష్‌బాబును చరణ్‌ మించలేక పోయాడు.

కాని తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం భరత్‌ అనే నేను చిత్రం కంటే ఎక్కువగా రంగస్థలం షేర్‌ను దక్కించుకుంది.

భరత్‌ అనే నేను చిత్రానికి కనీసం 100 కోట్ల షేర్‌ కూడా రాలేదు అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం అద్బుతమైన కలెక్షన్స్‌ను రాబట్టిందని, అయితే భరత్‌ అనే నేను మాత్రం అంతగా రాబట్టడంలో విఫలం అయ్యింది.మొత్తంగా రంగస్థలం చిత్రం 125 కోట్ల షేర్‌ను క్రాస్‌ చేస్తే భరత్‌ అనే నేను మాత్రం 96 కోట్ల షేర్‌ వద్ద ఆగిపోయినట్లుగా ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇక ఇతర రైట్స్‌ ద్వారా కూడా రంగస్థలం చిత్రం నిర్మాతలకు ఎక్కువగా ముట్టినట్లుగా తెలుస్తోంది.ఇలా మొత్తంగా భరత్‌ అనే నేను చిత్రంపై రామ్‌ చరణ్‌ రంగస్థలం చిత్రం పై చేయి సాధించినట్లయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube