మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం గురించి తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ సౌత్ ఇండియా ప్రేక్షకులకు తెలిసిందే.ఈ సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ను నమోదు చేసుకున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్ చిట్టిబాబు పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు.
చెవిటివాడి పాత్రలో చరణ్ యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్లో అతడు చూపించిన పర్ఫార్మెన్స్కు జనాలు ఫిదా అయ్యారు.
సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కడంతో మాస్ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు క్యూ కట్టారు.ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.
కాగా ఈ సినిమా 30 మార్చి 2018లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.నేటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా పోస్టర్స్ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.