తెలుగులో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన “రంగస్థలం” చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రంలో నటించిన నటీనటులు ప్రతి ఒక్కరూ కూడా తమ పాత్రలకి 100% న్యాయం చేశారనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఈ చిత్రం లో రామ్ చరణ్ తేజ్ చెల్లెలి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ అన్నీ కూడా తన నటనతో బాగానే ఆకట్టుకుంది.ఇప్పుడు బేబీ అన్నీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం….
బేబీ అన్నీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగింది.దాంతో బేబీ అన్నీ కి తెలిసిన వారి ద్వారా 2005వ సంవత్సరంలో టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు, చార్మి కౌర్ నటించిన “అనుకోకుండా ఒక రోజు” అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం వచ్చింది.
ఆ తరువాత వరుసగా మరిన్ని తెలుగు చిత్రాలలో నటించే అవకాశాలు దక్కించుకుంది.అంతేగాక చిన్నప్పుడు బాలలకు ప్రధానం చేసేటటువంటి నంది అవార్డును కూడా గెలుచుకుంది.ఈ క్రమంలో ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క అడపాదడపా సినిమాల్లో నటిస్తూ అటు చదువుని, ఇటు తనకు ఇష్టమైన సినిమాలని బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తోంది.
అయితే బేబీ అన్నీ తెలుగులో కింగ్ నాగార్జున, మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, నందమూరి బాలకృష్ణ, తదితర హీరోల చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.
కాగా ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించినటువంటి “రాజన్న” చిత్రంలో మల్లమ్మ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ప్రస్తుతం అన్నీ సినిమాల్లో హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.