తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ అయిన ఈ టీవీలో ప్రతి శనివారం రాత్రి 9.30 గంటలకి ప్రసారం అయ్యే “క్యాష్ – దొరికినంత దోచుకో” ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి వారం యాంకర్ సుమ సెలబ్రిటీలను తీసుకొచ్చి సందడి చేస్తున్న కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పటిలాగే ఈ వారం ఈ షో లో నలుగురు సెలెబ్రిటీలు పాల్గొన్నారు. వారు ఎవరో కాదు రంగస్థలం మహేష్, వైవా హర్ష, జోష్ రవి, సుదర్శన్.అయితే వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమో ని తాజాగా షో నిర్వాహకులు యూట్యూబ్ లో విడుదల చేశారు.
అయితే ఈ ప్రోమో లో సుమ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మహేష్ ని సుమ ఈ రెండింటిలో ఏది చేసి తప్పు చేశానని ఫీల్ అయ్యారని ఒకటి పెళ్లి చేసుకోవడం, రెండవది సినిమా యాక్టర్ అవ్వడం అని అడగగా మహేష్ ఆచంట వెంటనే పెళ్లి చేసుకుని తప్పు చేశాననని అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.
దాంతో సుమ ఏకంగా బ్రేకింగ్ న్యూస్ పెళ్లి చేసుకుని తప్పు చేశానని అంటున్న మహేష్ అంటూ అందరిని ఒక్కసారిగా నవ్వించింది. ఆ తర్వాత మహేష్ భార్య పావని కి ఫోన్ చేసి మీ ఆయన గురించి తెలియజేయండని అడగ్గా పావని తన భర్త గురించి తెలియజేతూ మా అయన “వరల్డ్ బెస్ట్ హస్బెండ్” అని చెప్పుకొచ్చింది.
దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో మహేష్ రంగస్థలం, శతమానం భవతి, గుణ 369, మహానటి, తదితర చిత్రాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
దీంతో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.