టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి సుకుమార్.రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా కమర్షియల్ జోనర్ లోనే కథలు చెప్పే దర్శకులలో సుకుమార్ టాప్ లో ఉంటాడు.అతని సినిమాలు చూస్తున్నప్పుడు పవర్ ఫుల్ హీరోయిజం కనిపిస్తుంది.అదే సమయంలో మంచి కథ, కథనం కూడా ఉంటుంది.ఈ రెండింటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తూ సినిమాలు చేయడం వలన సుకుమార్ స్టార్ దర్శకుడు అవ్వగాలిగాడని ఎవరైనా చెబుతారు.నాన్నకు ప్రేమతో సినిమాలో నేచర్ లాని స్క్రీన్ ప్లేలో అద్బుతంగా ప్రెజెంట్ చేసి ప్రేక్షకులని ఆలోచింపజేసిన సుకుమార్ తరువాత రంగస్థలంలో మన ఊళ్ళో కనిపించే రాజకీయాలని తనదైన శైలిలో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ కూడా తనని తాను పూర్తి స్థాయిలో నటుడుగా ఆవిష్కరించుకున్నాడు.ఇప్పుడు అల్లు అర్జున్ తో పుష్ప సినిమాని సుకుమార్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే రంగస్థలం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కడుతుంది.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు.
సుకుమార్ పుష్ప సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో మరో పాన్ ఇండియా ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని మైత్రీ నిర్మాతలు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ 2022లో సెట్స్ పైకి వెళ్తుందని కూడా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేశారు.