ఆన్ లైన్ లో ఇసుక ఆర్డర్ చేస్తే మనిషి పుర్రె వచ్చింది

ఆన్ లైన్ లో ఇసుక ఆర్డర్ చేస్తే ఒక మనిషికి సంబందించిన పుర్రె అందులో ప్రత్యక్షం అయ్యింది.దీంతో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

 Rangareddy Dist Sand Online Booking-TeluguStop.com

రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్నాడు.దానిని యార్డ్ నుంచి తన స్థలంకి తీసుకొచ్చి డంపింగ్ చేయించాడు.

డంపింగ్ చేసిన ఇసుకలో అకస్మాత్తుగా అతనికి మనిషి పుర్రె కనిపించింది.దీంతో ఇసుక బుక్ చేసిన శ్రీనివాస్ రెడ్డి తాను ఇసుకని కొన్న స్టాక్ యార్డ్ కి వెళ్లి చూడగా అందులో అస్థిపంజరం తలభాగం కనిపించింది.

దీంతో అనుమానం వచ్చి స్టాక్ యార్డుకి వెళ్లి అందులో పరిశీలించగా ఓ అస్థిపంజరం ఉన్నట్లు గుర్తించాడు.

ఇంకా ఆ ఇసుకని వెతకగా అందులో చెయ్యి చేయి భాగం ఓ చోట, మరో ఎముక భాగం ఓ చోట చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

చేతి ఎముకకు ఉన్న గాజుల ఉదంతంతో ఆ మృతదేహం ఒక మహిలదని గుర్తించారు.ఈ ఘటనపై శ్రీవాస్ రెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేశారు.దీంతో ఎల్బీ నగర్ డీసీపీ యాదగిరి సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఆ ఇసుకలో మహిళ చీర కూడా కన్పించింది.దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక స్టాక్ పాయింట్ కి ఇసుకని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే విషయాన్ని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఇక దొరికిన మహిళా అవయవాలని కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ కి కూడా పంపించి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube