ఆన్ లైన్ లో ఇసుక ఆర్డర్ చేస్తే ఒక మనిషికి సంబందించిన పుర్రె అందులో ప్రత్యక్షం అయ్యింది.దీంతో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్నాడు.దానిని యార్డ్ నుంచి తన స్థలంకి తీసుకొచ్చి డంపింగ్ చేయించాడు.
డంపింగ్ చేసిన ఇసుకలో అకస్మాత్తుగా అతనికి మనిషి పుర్రె కనిపించింది.దీంతో ఇసుక బుక్ చేసిన శ్రీనివాస్ రెడ్డి తాను ఇసుకని కొన్న స్టాక్ యార్డ్ కి వెళ్లి చూడగా అందులో అస్థిపంజరం తలభాగం కనిపించింది.
దీంతో అనుమానం వచ్చి స్టాక్ యార్డుకి వెళ్లి అందులో పరిశీలించగా ఓ అస్థిపంజరం ఉన్నట్లు గుర్తించాడు.
ఇంకా ఆ ఇసుకని వెతకగా అందులో చెయ్యి చేయి భాగం ఓ చోట, మరో ఎముక భాగం ఓ చోట చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
చేతి ఎముకకు ఉన్న గాజుల ఉదంతంతో ఆ మృతదేహం ఒక మహిలదని గుర్తించారు.ఈ ఘటనపై శ్రీవాస్ రెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేశారు.దీంతో ఎల్బీ నగర్ డీసీపీ యాదగిరి సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఆ ఇసుకలో మహిళ చీర కూడా కన్పించింది.దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక స్టాక్ పాయింట్ కి ఇసుకని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే విషయాన్ని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఇక దొరికిన మహిళా అవయవాలని కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ కి కూడా పంపించి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.