మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన సినిమా తో హీరో గా పరిచయమైన వైష్ణవ్ తేజ్ అనూహ్యం గా మొదటి సినిమా తోనే వంద కోట్ల క్లబ్ లో చేరి పోయాడు.ఇప్పటి వరకు ఏ ఇండియన్ హీరో కూడా మొదటి సినిమా తో వంద కోట్ల వసూళ్ల ను సొంతం చేసుకున్న దాఖలాలు లేవు.
అది కేవలం మెగా హీరో వైష్ణవ్ తేజ్ మాత్రమే దక్కింది.ఉప్పెన సినిమా తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు సినిమా ఎంపిక విషయంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని తన నటన తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వం లో కొండపొలం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.
ఆ సినిమా లో నటన తో మరో సారి మెప్పించిన వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇప్పటికే రంగరంగ వైభవంగా సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది.
రంగ రంగ వైభవంగా అనే టైటిల్ తో సినిమా విడుదల కాబోతున్న ట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.ఇక ఈ సినిమా ను జులై 1వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా లో హీరోయిన్ గా కేతిక శర్మ నటించడం తో పాటు వైష్ణవ్ తో బ్యూటిఫుల్ రొమాన్స్ ని మరియు లవ్ కెమిస్ట్రీ పండించనున్నట్లుగా ఇటీవలే విడుదలైన టీజర్ తో క్లారిటీ వచ్చేసింది.
ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.ఇక అర్జున్ రెడ్డి సినిమా కు సహాయ దర్శకుడి గా వ్యవహరించి… తమిళం లో అర్జున్ రెడ్డి రీమేక్ కు దర్శకత్వం వహించి మంచి పేరు దక్కించుకున్న గిరీశయ్య ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.జులై 1వ తారీకున ఇతర సినిమా లు లేకపోవడంతో వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా ఖచ్చితంగా మంచి వసూళ్లను సొంతం చేసుకుంటుందనే నమ్మకం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.