క్రియేటివ్ దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి కృష్ణ వంశీ.అతని కెరియర్ లో ఒక్క జోనర్ కి మాత్రమే పరిమితం కాలేదు.
క్రైమ్ స్టోరీస్, థ్రిల్లర్, ఫ్యామిలీ, రొమాంటిక్, లవ్ అన్ని జోనర్స్ లో సినిమాలు తీసి మెప్పించారు.కృష్ణవంశీ సినిమాలు అంటే హీరోయిన్స్ కి మంచి ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయం ఉంది.
అలాగే వారిని అందంగా చూపించడంలో తన క్రియేటివిటీని ఈ దర్శకుడు చూపిస్తాడు.ఇదిలా ఉంటే కృష్ణవంశీ దర్శకత్వంలో చివరిగా వచ్చిన చిత్రం నక్షత్రం.
ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.కంటెంట్ బాగున్నా నేరేషన్ లో కన్ఫ్యూజన్ కథని డామినేట్ చేసి నక్షత్రం ఫ్లాప్ కి కారణం అయ్యింది.
ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరాఠీలో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.రంగ మార్తాండ టైటిల్ తో ఈ సినిమాని తెలుగులో కృష్ణవంశీ రీమేక్ చేశాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా చేస్తున్నారు.
అలాగే శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కృష్ణ వంశీ లాంచ్ చేశాడు.
అది కూడా చాలా సింపుల్ లో లుక్ వదిలేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కోసం చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.
మేనెల ఆఖరులో పెద్ద సినిమాలు ఏవీ కూడా రిలీజ్ లేవు కాబట్టి కాస్తా సేఫ్ జోన్ లో దిగితే మంచిది అనే ఉద్దేశ్యంతో ఆ టైంలో మంచి డేట్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు బోగట్టా.దీనికి సంబంధించి త్వరలో క్లారిటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని సమాచారం.