టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ చెక్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని చూసిన నితిన్కు చుక్కెదురైంది.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ ‘రంగ్దే’ను కూడా రిలీజ్కు రెడీ చేశాడు.ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఇక ఈ సినిమాతో పక్కా హిట్ కొట్టి తీరాలని చూస్తున్నాడు నితిన్.కాగా ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.కాగా ఈ సినిమా ట్రైలర్ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ ట్రైలర్ను ఆషామాషీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీగా లేరని తెలుస్తోంది.ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ను కర్నూలులో ఎస్టీబీసీ కాలేజీలో మార్చి 19న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ ట్రైలర్ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు రంగ్దే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.అంతేగాక ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు చిత్ర నటీనటులు, టెక్నీషియన్లు అందరూ హాజరవుతున్నట్లు వారు తెలిపారు.
నితిన్కు జోడీగా ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుండగా, టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మార్చి 26న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.