యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకరు.భీష్మ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్ ఈ మధ్యనే చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ ఈ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు.విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్ చెక్ సినిమాను కూడా ఒక కొత్త కథతో తెరకెక్కించారు.చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా డిజాస్టర్ తర్వాత నితిన్ ఇప్పుడు ‘రంగ్ దే’ సినిమా ను విడుదల చేయడానికి రెడీ అయ్యాడు.
ఈ సినిమా మీదే నితిన్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు.ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఇప్పటికి ఈ సినిమా విడుదలకు ముహూర్తం కుదిరింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా తెరకెక్కుతుంది.
వెంకీ అట్లూరి తొలిప్రేమ, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా మార్చి 26 న విడుదల కాబోతుంది.అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పెంచారు.
కొత్త కొత్త వీడియోలను షేర్ చేస్తూ ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు.కీర్తి సురేష్, నితిన్ మధ్య జరిగిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేయడంతో అవి క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.నితిన్ కీర్తి సురేష్ ను ముక్కుపై గుద్దిన వీడియో ఇప్పటికే వైరల్ అయ్యింది.తాజాగా దేవి శ్రీ ప్రసాద్ ఒక వీడియోను షేర్ చేసాడు.ఈ వీడియోలో కీర్తి సురేష్ అందరి ఫుడ్ ను ఒక్కతే తింటూ కనిపించింది.ఇది చూసిన నితిన్, దేవి శ్రీ ప్రసాద్ షాక్ అయ్యారు.
తర్వాత మన బ్రతుకే బస్ స్టాండ్ అనే పాటతో నెత్తి బాదుకున్నారు.ఈ వీడియో కొన్ని నిముషాల్లోనే వైరల్ అయ్యింది.