సిల్వర్ స్క్రీన్ పై హిట్ అయిన సినిమాలు కొన్ని బుల్లితెరపై అంతగా ప్రభావం చూపించవు.ఛానల్స్ వారు శాటిలైట్ హక్కులని హీరో రేంజ్ బట్టి భారీ మొత్తంలో చెల్లించి సొంతం చేసుకుంటారు.
అయితే కొన్ని సినిమాల విషయంలో ఛానల్స్ వారికి పెట్టిన పెట్టుబడి వర్క్ అవుట్ అవుతుంది.ఒక్కోసారి మాత్రం థియేటర్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న టీవీ ప్రేక్షకులకి మాత్రం ఆ సినిమాలు కనెక్ట్ కాకపోవడం అనుకున్న స్థాయిలో రేటింగ్స్ రావు.
దీంతో శాటిలైట్ హక్కుల విషయంలో వారికి నష్టాలు తప్పవు.
అయితే బిగ్ స్క్రీన్ పై ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలు బుల్లితెరపై గ్రాండ్ విక్టరీని కొట్టడంతో పాటు ఊహించని స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంటాయి.
మహేష్ బాబు అతడు సినిమా థియేటర్ లో పెద్దగా హిట్ కాలేదు.కాని టీవీలో వేసిన ప్రతిసారి మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది.తాజాగా నితిన్ రంగ్ దే మూవీకి కూడా ఇలాంటి ఫలితమే వచ్చింది.నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ థియేటర్ లో ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు.
అయితే బుల్లితెరపై మాత్రం ఏకంగా 7 టీఆర్పీ పాయింట్స్ తెచ్చుకొని పరవాలేదనిపించుకుంది.నితిన్ సూపర్ హిట్ మూవీ భీష్మ బుల్లితెరపై కేవం 6.7 టీఆర్పీ రేటింగ్ మాత్రమే తెచ్చుకోగా రంగ్ దే మూవీ దానిని బీట్ చేయడం విశేషం.బ్లాక్ బస్టర్ మూవీ కంటే ఫ్లాప్ మూవీకి టీవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని దీనిని బట్టి అర్ధమవుతుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నితిన్ నటించిన మ్యాస్ట్రో మూవీ ఒటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.దీనికి సంబందించిన డీల్ కూడా ఇప్పటికే క్లోజ్ అయినట్లు బోగట్టా.