యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని వెంకీ అట్లూరి తెరకెక్కించాడు.ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి.
దీంతో సినిమా మీద మంచి హైప్ ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే జరిగిపోయినట్లు తెలుస్తుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించింది.అయితే సినిమాకి ఉన్న హైప్ కారణంగా ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా 36 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది.
థీయాట్రికల్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్ని కూడా అమ్ముడైపోయాయని తెలుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్ రైట్స్ ని ఫారస్ ఫిలిమ్స్ వారు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.ఇక ఓవర్సీస్ రిలీజ్ కోసం వీళ్ళు నిర్మాతకి ఏకంగా 1.5 కోట్లు చెల్లించారని తెలుస్తుంది.
ఓ విధంగా చెప్పాలంటే నితిన్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఓవర్సీస్ కి ఇంత పెద్ద మొత్తంలో రైట్స్ రావడం గ్రేట్ అని చెప్పాలి.అయితే సినిమా అవుట్ పుట్ భాగుండటంతో పాటు, పాజిటివ్ టాక్ ఉండటం, అలాగే హైక్లాస్ పీపుల్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఉండటంతో అక్కడి ప్రేక్షకులకి నచ్చితుందని ఇంత పెద్ద మొత్తంలో చెల్లించినట్లు తెలుస్తుంది.ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కీర్తి సురేష్ ఇమేజ్ కూడా సినిమా బిజినెస్ పెరగడానికి కారణమని టాక్ వినిపిస్తుంది.ఈ నెల 26న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
చెక్ తో ఈ ఏడాదిలో ఫస్ట్ డిజాస్టర్ కొట్టిన నితిన్ కి ఈ సినిమా బూస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.