బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్భీర్ కపూర్, అలియా భట్ జంట గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల ఆలియా కు ఒక కూతురు కూడా జన్మించిన విషయం తెలిసిందే.
అయితే అలియా భట్, రణ్భీర్ కపూర్ పెళ్లి అయిన తర్వాత విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది.
ఈ సినిమా తర్వాత విడుదల అయినా షంషేరా సినిమా రన్బీర్ కెరియర్ లోనే ఒక భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
ఏడాది జులై 22న థియేటర్లలో ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను తాజాగా హీరో రణ్భీర్ కపూర్ వెల్లడించారు.
సందర్భంగా హీరో రణ్భీర్ కపూర్ మాట్లాడుతూ.షంషేరా సినిమా ఫ్లాప్ అవ్వడానికి మేము చేసిన పొరపాట్లే ప్రధాన కారణం.
అందులో ముఖ్యంగా నా గడ్డం కూడా ఒకటి.ఈ సినిమా కోసం నేను ఒక కృత్రిమ గడ్డం ని పెట్టుకున్నాను.
సినిమాలో ఎండలో షూటింగ్ చేసే సమయంలో అది సరిగా కనిపించలేదు.ముఖానికి అతుక్కున్నట్లు కనిపించింది.
అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు హీరో రణ్భీర్ కపూర్.
ఇదే విషయాన్ని ఇటీవల దుబాయిలో జరిగిన ఒక ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చారు.అయితే ఈ సినిమా వైఫల్యానికి గడ్డం కూడా ప్రధాన కారణం కావచ్చు అని బాలీవుడ్ మరొక హీరో అయిన అక్షయ్ కుమార్ సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రణ్భీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న యానిమల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో టాలీవుడ్ బ్యూటీ రష్మిక వందన హీరోయిన్ గా నటిస్తోంది.