రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మాస్త్రం.ఈ మూవీలో కింగ్ నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.సినిమాను తెలుగులో రాజమౌళి రిలీజ్ చేస్తున్నారు.రాజమౌళి ఇన్ పుట్స్ తీసుకుని కూడా సినిమా మేకింగ్ చేస్తున్నారని తెలుస్తుంది.సెప్టెంబర్ 9న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు తెలుగులో భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ క్రమంలో త్వరలో వైజాగ్ లో బ్రహ్మాస్త్రం టీం కోసం భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు.
ఆ తర్వాత ఓ ఈవెంట్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.రాజమౌళి డైరెక్ట్ చేయకపోయినా సమర్పిస్తున్న ఈ సినిమాకు ఆయన మార్క్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అందుకే బ్రహ్మాస్త్రం సినిమాకు వైజాగ్ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.వైజాగ్ బీచ్ రోడ్ లో ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారట.
అలా బ్రహ్మాస్త్రం సినిమాకు తెలుగులో బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.ఆర్.
ఆర్.ఆర్ సినిమాలో నటించిన అలియా భట్ చేస్తున్న సినిమా కాబట్టి తెలుగు ఆడియెన్స్ బ్రహ్మాస్త్రం మీద అంచనాలు పెంచుకున్నారు.బ్రహ్మాస్త్రం పార్ట్ 1 టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచింది.