కెరియర్ లో భిన్నమైన పాత్రలు చేస్తూ తన మార్క్ చూపించుకుని ప్రయత్నం చేస్తున్న రౌడీ పిల్ల సాయి పల్లవి చేస్తున్న మరో డిఫరెంట్ చిత్ర విరాటపర్వం.ఈ సినిమాలో సాయి పల్లవి ట్రైబల్ అమ్మాయిగా నటిస్తుంది.
నీది నాది ఒకటే కథ సినిమాతో అందరిదృష్టిని ఆకర్షించిన దర్శకుడు వేణు ఊడుగుల ఈ విరాటపర్వం సినిమాని తెరపై ఆవిష్కరిస్తున్నారు.స్వతహాగాగా రచయిత కావడంతో కమ్యూనిజం భావజాలం ఎక్కువగా ఉండటంతో నక్షలైట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథని సిద్ధం చేసుకొని దగ్గుబాటి రానాని మెప్పించి సినిమా చేస్తున్నాడు.
సురేష్ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా లాక్ డౌన్ కి మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
సినిమాలో మెయిన్ లీడ్స్ కి సంబందించిన లుక్స్ కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసి సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ మరల ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రానా, సాయిపల్లవితో పాటు ప్రియమణి, నందితా దాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ మొదటివారం నుంచి మళ్లీ మొదలు కానుందని టాక్.
దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది.మిగిలిన భాగాన్ని తాజా షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు.
ఇక సాయి పల్లవి లవ్ స్టోరీ మూవీ కూడా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై చివరి దశకి చేరుకుంది.ఈ నెలాఖరుకి లవ్ స్టోరీ షూటింగ్ పూర్తి అవ్వబోతూ ఉండగా, దాని తర్వాత వెంటనే సాయి పల్లవి విరాటపర్వంలోకి వచ్చి పడుతుంది.