టాలెంటెడ్ డైరెక్టర్ తేజ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా అలివేలు వెంకటరమణ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల ప్రారంభించే అవకాశం ఉంది.మరో వైపు తన మొదటి సినిమాకి సీక్వెల్ గా చిత్రం 1.1 అనే చిత్రాన్ని ఆ మధ్య ప్రకటించాడు.దీనిని అందరూ కొత్తవాళ్లతోనే తెరకెక్కించాలని భావిస్తున్నారు.ఇక ఈ సినిమా ద్వారా నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ని హీరోగా పరిచయం చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే అలువేలు వెంకటరమణ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాతనే చిత్రం 1.1 స్టార్ట్ చేసే అవకాశం ఉంది.గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.
ఇది పూర్తయిన తర్వాత తేజతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ గోపీచంద్ కి జోడీగా నటించనుందని తెలుస్తుంది.అనుష్క పేరు ముందుగా వినిపించిన కీర్తి సురేష్ ని ఫైనల్ చేసినట్లు బోగట్టా.
ఇక సినిమాలో రానా ఓ క్యామియో రోల్ పోషించబోతున్నాడు అని తాజాగా వినిపిస్తుంది.సినిమా క్లైమాక్స్ లో అతని పాత్ర సర్ప్రైజింగ్ గా కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు.గతంలో రానాకి నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తేజ మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చాడు.అదే సమయంలో మరో పొలిటికల్ థ్రిల్లర్ ని రానాగా ప్లాన్ చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో అలివేలు వెంకటరమణ సినిమాలో క్యామియో రోల్ చేయడానికి రానా ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే రానా హీరోగా చేసిన విరాటపర్వం మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ కాగా పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో చేస్తున్న అయ్యప్పన్ కోశియమ్ షూటింగ్ దశలో ఉంది.