టాలీవుడ్ యంగ్ హీరో రానా సీనియర్ హీరో శోభన్ బాబు బయోపిక్ లో నటించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆయన జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రముఖ ఫిలిం మేకర్ రెడీ అవుతున్నాడని అందుకు సంబంధించిన స్క్రిప్టు రెడీ చేసి రానా కు వినిపించగా తప్పకుండా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడు అంటూ వార్తలు వచ్చాయి.
శోభన్ బాబు పాత్రకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో కేవలం రానా అయితేనే సెట్ అవుతాడని ఖచ్చితంగా ఆయన బయోపిక్ తీయాల్సిందే అంటూ చాలా మంది నెట్టింట గత కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్నారు.ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే రానా శోభన్ బాబు బయోపిక్ ను మొదలు పెట్టే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది.
కానీ తాజాగా వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు అసలు రానా వద్దకు శోభన్ బాబు సినిమా రానేలేదట. ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు.
ఆ సినిమా కాకుండా మరికొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నాయి.కాని ఇప్పటి వరకు ఏవి ఫైనల్ కాలేదని ఆయన పీఆర్ టీం పేర్కొన్నారు.
విరాటపర్వం కు ముందు రానా నటించిన అరణ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.ఆ సినిమా కూడా ఒక వ్యక్తి బయోపిక్ అంటూ వార్తలు వచ్చాయి.
సినిమా ప్రమోషన్ కూడా మొదలు పెట్టిన సమయంలో కరోనా రావడం వల్ల విడుదల వాయిదా వేశారు.ఓటీటీ ద్వారా విడుదల చేయాలని ప్రయత్నాలు చేసినా కూడా మేకర్స్ ఓటీటీకి ఇచ్చేందుకు నిరాకరించారు.
థియేటర్లు ఓపెన్ కు సిద్ధమైన నేపథ్యంలో ఈ నెల ఆఖరికి గాని వచ్చే నెలలో కానీ అరణ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.