యంగ్ హీరో రానా మరో సినిమా ను కన్ఫర్మ్ చేశాడు.ఇటీవలే ఆయన అరణ్య సినిమా ను విడుదల చేసిన విషయం తెల్సిందే.
మరో వైపు విరాట పర్వం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.ఇక పవన్ కళ్యాణ్ తో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో కూడా రానా నటిస్తున్నాడు.
చేతిలో ఉన్న సినిమా లు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా పూర్తి చేస్తున్నాడు.ప్రస్తుతం రానా తో ఆయన సినిమా షూటింగ్ దశలో ఉంది.
త్వరలోనే అది కూడా ముగియబోతుంది.రానా ఒక బాలీవుడ్ సినిమా కు కమిట్ అయ్యాడు.
అది ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.మరో వైపు రానా కొత్త సినిమా కు ఓకే చెప్పాడు.
ఆచంట గోపీచంద్ మరియు రాంబాబు సీహెచ్ నిర్మాణంలో ఆ సినిమా ఉండబోతుంది.ఇది ఒక పాన్ ఇండియా మూవీ అంటూ వారు చెబుతున్నారు.
ప్రస్తుతం రానా చేస్తున్న పవన్ మూవీ పూర్తి అయిన తర్వాత కొత్త సినిమా ను ప్రారంభిస్తామని చెబుతున్నారు.ఆచంట గోపీచంద్ ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో యూనివర్శిల్ సబ్జెక్ట్ తో రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉంటుందని వారు చెబుతున్నారు.ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయాన్ని త్వరలోన ప్రకటిస్తారట.
రానా తో వరుసగా సినిమా లు నిర్మిస్తున్న సురేష్ బాబు ఈ సారికి ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామి అవ్వడం లేదు.రానా కు భారీ పారితోషికం ఇచ్చి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ను వారు నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా లెవల్ లో రానా కు మంచి గుర్తింపు ఉంది.కనుక ఖచ్చితంగా ఈ సినిమా మంచి క్రేజ్ ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలో వెళ్లడిస్తారట.