బాహుబలి సినిమా తర్వాత రానా ఇప్పటి వరకు మరో హిస్టోరికల్ నేపధ్యంలో మూవీ చేయలేదు.అయితే సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో మైథలాజికల్ కథాంశంతో హిరణ్యకశిప సినిమా తెరకేక్కబోతుంది అనే విషయం అందరికి తెలిసిందే.
ఇక ఈ సినిమా కోసం సురేష్ ప్రొడక్షన్ మొదటి సారిగా రెండు వందల కోట్ల రూపాయిలు వెచ్చిస్తుంది.ఇదిలా ఉంటే గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా స్క్రిప్ట్ పై దర్శకుడు గుణశేఖర్ వర్క్ చేసాడు.
ఇప్పటికే ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కుతుంది అని నిర్మాత సురేష్ బాబు స్పష్టం చేసేసాడు.
ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు గుణశేఖర్ హిరణ్యకశిప సినిమా గురించి ట్విట్టర్ లో స్పందించాడు.
మూడేళ్ళుగా చేస్తున్న హిరణ్యకశిప ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింది అని, ఇక త్వరలో ఈ సినిమా సెట్స్ కి వెళ్ళబోతుంది అని చెప్పుకొచ్చాడు.తన డ్రీం ప్రాజెక్ట్ గా హిరణ్యకశిప సినిమాని తెరకెక్కిస్తున్న గుణశేఖర్ టైటిల్ రోల్ లో రానాని తీసుకోవడం ద్వారా హిందువులు రాక్షసుడుగా భావించే హిరణ్యకశిపుడులో మరో కోణాన్ని ఆవిష్కరింబోతున్నాడు అని అర్ధమవుతుంది.
మరి ఈ సినిమా టాలీవుడ్ లో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుంది అనేది వేచి చూడాలి.