ఇదివరకు కాలంలో టాప్ హీరోలు అందరూ మల్టీస్టారర్ సినిమాలు తీయడానికి చాలా ఇష్టంగా ముందుకు వచ్చేవారు ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ టాప్ హీరోలు మల్టీస్టారర్ గా నటించడం మానేశారు.ఇలాంటి సమయంలో హిరో విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు లు ఇద్దరు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు నాంది పలికారు.
ఆ తర్వాత కూడా ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు తీయడానికి ఎంతమంది సుముఖత చూపుతున్నారు.ఆ తర్వాత హీరో వెంకటేష్ తో పవన్ కళ్యాణ్ అలాగే ఆయన మేనల్లుడు నాగచైతన్య, హీరో రామ్ అందరు ఒక్కొక సినిమాలో ఆయనకు కోస్టార్ గా నటించారు.
త్వరలో హీరో వెంకటేష్ తన అన్న కొడుకు దగ్గుబాటి రానా తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా రంగం సిద్ధమైనట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ బాధ్యతలు మొదలైనట్లు తెలుస్తోంది.
ఇకపోతే వీరిద్దరి సినిమా ఇది వరకు తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాను రీమేక్ చేసినట్లు తెలుస్తోంది.ఇంకా పూర్తి వివరాలు తెలియకుండానే ఈ సినిమాకి వెంకీ బాబాయ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు కూడా తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి ఇప్పటికీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.ఒకవేళ వచ్చే విధంగా ఉంటే డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాను ప్రకటించే అవకాశం లేకపోలేదు.
ఇక అసలు విషయంలోకి వెళితే.
చిన్నాన్న, కొడుకు ఇద్దరు సినిమా చేసే లోపు రియాల్టీ షో ప్లాన్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో దగ్గుబాటి రానా మొదలు పెట్టిన యూట్యూబ్ ఛానల్ కోసం వీరిద్దరు కలిసి ఓ షో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ రియాల్టీ షోకు ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూసుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఇదివరకే వీరిద్దరూ కృష్ణం వందే జగద్గురం అనే సినిమాలో కలిసి ఆడిపాడారు.
ఇదివరకు హీరో రానా నెంబర్ వన్ యారి అనే ప్రోగ్రాం లో టాలీవుడ్ ప్రముఖుల్ని ఆయన షో కి గెస్ట్ గా పిలిపించుకొని అందరినీ అలరించిన సంగతి తెలిసిందే.అయితే త్వరలో చేయబోయే రియాల్టీ షో ఎక్కడా చూడని విధంగా ఉంటుందని కొందరు టాలీవుడ్ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.అతి త్వరలో ఈ రియాల్టీ షో కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేలా కనబడుతోంది.ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా లో నటిస్తున్నాడు.అలాగే రానా నటించిన ఆరణ్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.