సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఎటువంటి అడ్డంకులు ఉండవని.ఎప్పుడు హ్యాపీ లైఫ్ ని గడుపుతారని అనుకోవడం పొరపాటు.
కేవలం వాళ్ళు సినిమాల వరకే అలా ఉంటారు కానీ వారి వ్యక్తిగత విషయంలో కూడా ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి.కానీ వారు వాటిని బయటికి పెట్టుకోరు.
కొన్ని కొన్ని సమయాలలో సెలబ్రెటీలకు సామాన్య ప్రజలకు మధ్య కొన్ని రకాల గొడవలు కూడా జరుగుతుంటాయి.చాలావరకు ఏదైనా స్థలానికి సంబంధించింది లేక డబ్బుల విషయంలో మాత్రం చాలా జరుగుతుంటాయి.
అలా ఇప్పటికీ చాలామంది సెలెబ్రిటీలు సామాన్య వ్యక్తుల విషయంలో వార్తలోకి ఎక్కారు.కొన్ని సమయాలలో కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంటారు.
అలా తాజాగా హీరో రానా కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన హీరో గానే కాకుండా విలన్ గా కూడా నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటున్నాడు.
ఈయన తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి 2010లో లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.ఇక ఈ సినిమా ఆయనకు మంచి సక్సెస్ను అందించింది.
పైగా ఆయన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఆ తర్వాత ఏడాది బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు.
అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక అలా తెలుగులో నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం, రుద్రమదేవి, బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి వంటి పలు సినిమాలలో నటించిన మంచి పేరు సంపాదించుకున్నాడు.
గత ఏడాది అరణ్య, 1945 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలు ఎందుకో అంతగా గుర్తింపు పొందలేదు.
ఈ ఏడాది విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈయన మంచి హోదాలో ఉన్న సమయంలో తన ప్రేయసి మిగతా బజాజ్ తో 2020లో వివాహం చేసుకున్నాడు.ఓ వైపు పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు సినిమా జీవితంలో బిజీగా గడుపుతున్నాడు.ఇదిలా ఉంటే రానా గత కొన్ని రోజుల నుండి ఒక స్థలంకు సంబంధించిన కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే.
హైదరాబాదులో ఫిలింనగర్ పరిధిలో ఓ స్థలాన్ని 2014లో ఓ సంస్థ లీజుకు తీసుకుంది.ఇక ఆ సంస్థ యజమాని కుమారుడు ఆ స్థలాన్ని దగ్గుబాటి రానా పేరిట రిజిస్టర్ చేసినట్లు కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
దీనితో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.ఈరోజు కోర్టుకు హాజరు కాలేనని రానా పిటిషన్ చేయటంతో.ఈనెల 10న తప్పనిసరిగా హాజరు కావాలి అని కోర్టు ఆదేశించింది.లేదంటే అడ్వకేట్ కమిషన్ రానా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది.