టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు.ఇప్పటికే బాహుబలి, ఘాజీ లాంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు పూర్తి మార్కులు వేశారు.
కాగా ప్రస్తుతం ‘అరణ్య’(హాతీ మేరే సాతీ) అనే సినిమాతో మరోసారి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమా తరువాత కూడా పలు ప్రాజెక్టులను లైన్లో పెడుతూ వస్తున్నాడు.
ఇప్పటికే అరణ్యతో పాటు విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్న రానా, ఈ రెండు సినిమాలను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు.కాగా ఈ సినిమాల తరువాత గుణశేఖర్ డైరెక్షన్లో హిరణ్యకశ్యప అనే సినిమాలో కూడా నటించేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు చాలా సమయం పడుతుండగా, ఓ వెబ్ సిరీస్లో నటించేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ అందించిన కథను ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడు.ఈ వెబ్ సిరీస్లో రానా సరసన అందాల భామ శృతి హాసన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
10 ఎపిసోడ్స్తో ఈ సిరీస్ ఉండనుండగా, దీన్ని స్ట్రెయిట్ తెలుగులో తెరకెక్కించేందుకు యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ వెబ్ సిరీస్ను మొత్తం 10 భాషల్లో రిలీజ్ చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.కాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ను ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతోంది.
మరి సినిమాలే కాకుండా ఇలా వెబ్ సిరీస్లతోనూ రచ్చ చేయాలని చూస్తున్న రానా, ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే.ఇక విరాట పర్వం చిత్రంలో రానా సరసన అందాల భామ సాయి పల్లవి నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.