టాలీవుడ్ లో తన కుటుంబ సభ్యుల బ్యాక్గ్రౌండ్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ దక్కించుకున్న హీరో రానా దగ్గుబాటి.లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాహుబలి సినిమాతో తన తెలుగు భాష చిత్రాన్ని ఒక్కసారిగా ప్రపంచ స్థాయికి రానా దగ్గుబాటి తీసుకెళ్లి తానేంటో నిరూపించుకున్నాడు.
అయితే తాజాగా రానా దగ్గుబాటి తేజ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.ఇందులోభాగంగా ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ ని “రాక్షస రాజ్యంలో రావణాసురుడు” అని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే చిత్ర వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు కానీ తొందర్లోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు దర్శకుడు తేజ ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి నేనే రాజు నేనే మంత్రి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
అయితే ఇది ఇలా ఉండగా గతంలో రానా స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించాడు.అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.అయితే ఆ తరువాత బాలీవుడ్లో లో అక్షయ్ కుమార్ నటించిన టువంటి హౌస్ఫుల్ ఫోర్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో బాలీవుడ్ లో పలు అవకాశాలను తెచ్చి పెట్టింది.