టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించే చిత్రాలకు ప్రేక్షకులు మంచి ఆదరణ అందిస్తుంటారు.ప్రస్తుతం క్రిష్ రెండు సినిమాలను లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ ఓ సినిమాను అనౌన్స్ చేయగా, దాని రెగ్యులర్ షూటింగ్ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.కాగా మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను ఇప్పటికే పట్టాలెక్కించాడు క్రిష్.ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు క్రిష్ చూస్తున్నాడు.అయితే ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటిని సంప్రదించారట.అయితే ఈ పాత్ర సినిమాకు కీలకం కానుండటంతో ఇందులో నటించేందుకు రానా కూడా ఆసక్తి చూపుతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
గతంలో దర్శకుడు క్రిష్తో రానా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ అనే సినిమాలో నటించాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచినా రానాకు మంచి పేరును తీసుకొచ్చింది.
ఆ సినిమా కారణంగా రానా ఇప్పుడు క్రిష్ అడగ్గానే కేమియో పాత్ర చేసేందుకు రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.
ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ కూడా జరుపుకుంటోంది.
ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ అదిరిపోయే హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాడు.