టాలీవుడ్ సినీ నటుడు రానావిభిన్న పాత్రలతో మెప్పిస్తూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.పాన్ ఇండియా సినిమాలో నటించి మంచి క్రేజ్ ను అందుకున్నాడు.
ఇదిలా ఉంటే రానా ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాలో నటిస్తుండగా ప్రస్తుతం అరణ్య సినిమాలో బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రానా కు కరోనా దెబ్బ ఎదురయ్యింది.దీనివల్ల అరణ్య గురించి అఫీషియల్ ప్రకటన అందింది.
ప్రస్తుతం రానా డైరెక్టర్ ప్రభు సాల్మన్ దర్శకత్వంలో అరణ్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఏనుగుల నేపథ్యంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.అంతేకాకుండా ఇటీవలే ఈ సినిమా రిలీజ్ వేడుక కూడా జరిగింది.ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు.ఈ సినిమా పలు భాషలలో ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కనుంది.
ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా విడుదల కానుంది.కానీ ఈ సినిమా హిందీ భాషలో వాయిదా పడింది.ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడం జరగగా ప్రేక్షకులకు ఈ వార్తను పంచుకోవడం బాధాకరంగా ఉంది.కోవిడ్ 19 మరోసారి విజృంభిస్తున్న తరుణంలో అరణ్య హిందీ వెర్షన్ ( హాథి మేరీ సాథి) విడుదలను వాయిదా వేయడానికి నిర్ణయించుకున్నామని తెలపగా ఈ సినిమా విడుదల విషయాన్ని గురించి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ఇక తెలుగులో అరణ్య, తమిళంలో కాదన్ యధావిధిగా మార్చి 26న విడుదల కానుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది.