రానా హీరోగా రూపొంది ఇటీవలే వచ్చిన అరణ్య సినిమా నిరాశ పర్చింది.మొదటి రోజు కేవలం కోటిన్నర మాత్రమే రాబట్టింది.
భారీ పాన్ ఇండియా మూవీ అంటూ విడుదల చేసిన ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో కనీసం ఓపెనింగ్స్ ను కూడా రాబట్టుకోలేక పోయింది.ఈ సినిమా సెన్సార్ కాపీ పూర్తి అయిన సమయంలో సెన్సార్ సర్టిఫికెట్ పై రెండున్నర గంటలకు పైగానే ఈ సినిమా రన్ టైమ్ ఉంటుంది అంటూ వేశారు.
కాని సినిమా చూస్తే మాత్రం రెండు గంటలకు కాస్త అటు ఇటుగానే ఉంది.అంటే దాదాపుగా అర్థగంట సినిమాను ఎగరేశారు.
అంత సినిమా ఉండి ఉంటే ఫలితం ఏంటో అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సినిమా థియేటర్ల యాజమాన్యంకు కాస్త కరెంట్ బిల్లు అయినా తగ్గించారు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా మరీ ఎక్కువ సమయం ఉంటే బోరింగ్ గా ఉందని అనే అవకాశం ఉందని నిర్మాత సురేష్ బాబు కత్తెర పట్టుకుని మరీ కట్ చేశాడు.కాని విధి వైపరీత్యం కారణంగా అంత కట్ చేసినా కూడా సినిమా బోరింగ్ గానే ఉందని సినిమా చూసిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరీ ఇలాంటి టాక్ వినాల్సి వస్తుందని ఊహించలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రానా మరియు ఈ సినిమాలో విషాల్ విష్ణు కీలక పాత్రలో నటించారు.
ఫైనల్ ఎడిట్ లో మొత్తం విషాల్ పాత్రను లేపి అవతల పారేసినంత పని చేశారు.మరీ అంత దానికి ఎందుకు ఇంత చిత్రీకరించడం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ లో దాదాపుగా 15 శాతం ఖర్చు చేసిన సీన్స్ ను రిస్క్ అని తీసినా కూడా జనాలు ఇంకా బోరింగ్ గానే ఉందని అంటున్నారు అంటే అది కూడా ఉండి ఉంటే సినిమా మద్యలోనే వెళ్లి పోయేవారు కావచ్చు అంటూ నెటిజన్స్ మీమ్స్ షేర్ చేస్తున్నారు.