ఈ ఏడాది టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.అయితే గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్న వారి కలలకు కరోనా ఫుల్ స్టాప్ పెట్టింది.
అతిరధ ప్రముఖుల మధ్య వైభవంగా జరగాల్సిన పెళ్లి వేడుక ఈ కరోనా కష్టంతో అతి కొద్ది బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుగుతున్నాయి.ఇప్పటికే యువ హీరోలైన నిఖిల్, నితిన్ పెళ్లి చేసుకున్నారు.
వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి వేడుకని చాలా సింపుల్ గా ముగించేశారు.ఇక ఇప్పుడు హీరో రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
తాను ప్రేమించిన మిహికాతో ఈ నెల 8న వివాహం జరగనుంది.ఇప్పటికే వీరి రెండు కుటుంబాలలో పెళ్లి పనులు ప్రారంభం అయిపోయాయి.
అయితే రానా-మిహిక పెళ్లి వేడుకకి సినీ ప్రముఖులు హాజరవుతారని, వైభవంగా జరగనుంది అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.దీనికి సురేష్ బాబు ఫుల్ స్టాప్ పెట్టాడు.
రానా పెళ్లి చాలా సింపుల్ గా జరుగుతుందని.కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరవుతారని చెప్పారు.
వీరిలో ఇరు కుటుంబ సభ్యులు తప్ప బంధువులు, సినీ పెద్దలు ఎవరూ హాజరుకావడం లేదని తేల్చి చెప్పేశారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ పెళ్లి వేడుక జరుపుతామని అన్నారు.
పెళ్లికి వచ్చే వాళ్లందరికీ కచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.రెండు కుటుంబాలు సమ్మతితోనే కేవలం కుటుంబ సభ్యుల మధ్యన ఈ పెళ్లి వేడుక జరిపించడం జరుగుతుందని తెలిపారు.
ఇక తెలుగు, మార్వాడి సంప్రదాయల ప్రకారం పెళ్లి వేడుకలు జరగనున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ ఏడాది సెలబ్రిటీ పెళ్ళిళ్ళు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా జరిగిపోతున్నాయని చెప్పాలి.