సినిమా ప్రముఖులు ఈమద్య కాలంలో తాము సంపాదించిన చిన్న మొత్తం అయినా పెద్ద మొత్తం అయినా అందులో కొంత భాగంను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతున్నారు.అప్పట్లో శోభన్ బాబు భారీగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి భూములు కొనుగోలు చేసిన కారణంగా ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ధనవంతుడు అయిన స్టార్ గా ఆయన నిలిచాడు.
ఆయన మృతి చెందే సమయంకు ఆయన ఆస్తుల విలువ వందల కోట్లు ఉన్నట్లుగా టాక్.
శోభన్ బాబును ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది స్టార్స్ కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న స్టార్స్లో చాలా మంది కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి ఉన్నారు.వారిలో కొందరు రియల్టర్ల వల్ల మోసపోయారు.తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు సీనియర్ స్టార్ రమ్యకృష్ణలు కోట్లలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి మోసపోయారు.హైదరాబాద్లోని రావిర్యలకు చెందిన భూములను సచిన్ టెండూల్కర్తో పాటు వీరిద్దరు హీరోయిన్స్ కొనుగోలు చేయడం జరిగింది.
అయితే ఆ భూమి కమర్షియల్ అమ్మకాలకు కాదని అందులో ఎలాంటి పనులు చేపట్టకూడదని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి.తాజాగా రియల్టర్ భాగస్వాముల మద్య తలెత్తిన వివాదంతో అసలు విషయం బయటకు వచ్చింది.దాంతో వీరిద్దరితో పాటు మరికొంత మంది కూడా కోట్లల్లో నష్టపోయి గగ్గోలు పెడుతున్నారు.ఏం జరుగబోతుందో అనే ఆందోళతో ఉన్నారు.