మహర్షి సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని దర్శకుడు అనిల్ ఫైనల్ చేసాడనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతిని దర్శకుడు సంప్రదించాడని టాక్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమాతో విజయశాంతి టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తుందని గట్టిగా వినిపిస్తుంది.
అయితే విజయశాంతి సినిమాలు చేసే అవకాశం లేదనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది.ఇక తాజాగా విజయశాంతికి దర్శకుడు అనిల్ రావిపూడి స్టొరీ కూడా చెప్పాడని మాట వినిపిస్తుంది.
ఇక ఆ పాత్రలో విజయశాంతి చేయనంటే ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న రమ్యకృష్ణని తీసుకోవడానికి రెడీగా ఉన్నాడని టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం విజయశాంతితో రెమ్యునరేషన్ విషయంలో చర్చ జరుగుతుందని సమాచారం.
ఇక ఈ సినిమాని వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి సంక్రాంతి బరిలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రావాలని దర్శకుడు అనిల్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయిందని తెలుస్తుంది.