స్టార్ హీరోయిన్ గా సౌత్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొని నెంబర్ వన్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ రమ్యకృష్ణ.సుమారు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరితో ఈ అమ్మడు ఆడిపాడింది.అలాగే ఎలాంటి పాత్రనయినా అవలీలగా చేయడం రమ్యకృష్ణ గొప్పతనం.నరసింహ సినిమాలో నీలాంబరిగా అహంకారం, పగ, ప్రతీకారాలతో రగిలిపోయి అమ్మాయి పాత్రలో అయిన ఆహ్వానం సినిమాలో కట్టుకున్న భర్తని మార్చుకోవాలని పరితపించే సాటి గృహిణిగా అయినా ఆమె పాత్రని ఒప్పుకుంటే అందులో పరకాయ ప్రవేశం చేసేస్తుంది అనే ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
అందులో కెరియర్ లో హీరోయిన్ గానే ఎన్నో భిన్నమైన పాత్రలని రమ్యకృష్ణ చేయగలిగింది.అలాగే ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ గా కూడా కొనసాగే అవకాశం ఈమెకి వచ్చింది.
ఇక పెళ్లి చేసుకొని కొంత కాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన రమ్యకృష్ణ తనదైన శైలిలో దూసుకుపోతుంది.బాహుబలిలో శివగామి పాత్రతో ఒక్కసారిగా స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.
ప్రస్తుతం టాలీవుడ్ ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న విమెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రమ్యకృష్ణ హవా కొనసాగిస్తుంది.ప్రస్తుతం ఆమె భర్త కృష్ణవంశీ దర్శకత్వంలోనే రంగమార్తాండ అనే సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది.
అలాగే తమిళ్, మలయాళీ బాషలలో భిన్నమైన పాత్రలు చేస్తూ నటిగా దూసుకుపోతుంది.ఈ వయసులో కూడా తమిళ్ విజయ్ సేతుపతి సూపర్ డీలాక్స్ సినిమాలో వేశ్య పాత్రలో నటించి పెద్ద సాహసమే చేసింది.
ఇప్పుడు సౌత్ లో అలాంటి మరో భిన్నమైన పాత్రలో ఆమె నటించడానికి ఒకే చెప్పింది.పెళ్లి అయిపోయి భర్త చనిపోయిన తర్వాత శారీరక వాంఛలతో సతమతం అయ్యే ఎజ్డ్ ఆంటీగా బోల్డ్ పాత్రలో నటించబోతుంది.
ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉందని సమాచారం.